లేటెస్ట్ : బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లతో దూసుకెళ్తున్న ‘టిల్లు స్క్వేర్’

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే ఆడియన్స్ ని అలరించి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని మల్లిక్ రామ్ తెరకెక్కించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై సాయి సౌజన్య, నాగవంశీ గ్రాండ్ గా నిర్మించారు.

ఇప్పటికే చాలా ఏరియాల్లో మంచి లాభాలు అందుకున్న ఈ మూవీ నేటితో వరల్డ్ వైడ్ గా రూ. 125.2 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి దూసుకెళ్తోంది. అయితే అక్కడక్కడా ఇంకా పలు ప్రాంతాల్లో టిల్లు స్క్వేర్ బాగానే రాబడుతోందని, మొత్తంగా ఈ మూవీ మరింతగా కొల్లగొట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. కాగా ఈ కామెడీ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీకి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించగా బీమ్స్ సిసిలోరియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Exit mobile version