మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు పెళ్లి పీటలెక్కబోతున్నారన్న ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ అప్పట్లోనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక దానికి తోడు వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లిలో లావణ్య కనిపించడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.
అయితే కొద్ది రోజులుగా ఈ టాఫిక్ సైలెంట్ అయిపోయింది. కానీ నిన్న వరుణ్ పుట్టిన రోజు కావడంతో బెంగుళూరుకు వెళ్లాడు. అయితే లావణ్య కోసమే వరుణ్ బెంగుళూరుకు వెళ్లాడని, డైమండ్ రింగ్ ఇచ్చి ఆమెకు ప్రపోజ్ చేశాడని మరోసారి కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై లావణ్య స్పందిస్తూ ప్రస్తుతం తాను డెహ్రాడూన్లో ఉన్నానని, ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నానని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పరోక్షంగా లావణ్య ఇచ్చిన క్లారిటీతో వరుణ్ ప్రపోజల్, పెళ్లి అంటూ వచ్చిన వార్తలకు చెక్ పడినట్టైందని చెప్పాలి.