మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘లైగర్’ టీమ్

మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ‘లైగర్’ టీమ్

Published on Aug 18, 2022 3:00 AM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్య పాండే తొలిసారిగా కలిసి నటిస్తున్న సెన్సేషనల్ మాస్ యాక్షన్ కమర్షియల్ పాన్ ఇండియన్ మూవీ లైగర్. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంస్థలు నిర్మించాయి. ఆగష్టు 25న పలు భాషల్లో భారీ స్థాయిలో లైగర్ ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ తో అందరిలో సూపర్ గా క్రేజ్ సొంతం చేసుకున్న లైగర్ మూవీ టీమ్ ప్రస్తుతం దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఫ్యాన్డం టూర్స్ చేస్తూ మూవీని ప్రేక్షశకాభిమానులకు మరింత చేరువ చేస్తోంది. దానితో పాటు నేటి నుండి టీమ్ మీడియా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగా హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరినీ లైగర్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన ఛార్మి స్పెషల్ గా ఒక ఇంటర్వ్యూ చేసారు.

అయితే దాని ప్రోమోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో ఛార్మి ఫ్రమ్ ఫ్యాన్స్, ఫర్ ఫ్యాన్స్ అనే కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ కోణం నుండి అడిగిన ప్రశ్నలకు పూరి, విజయ్ సమాధానం ఇస్తున్న వీడియో బైట్స్ ప్రోమోలో చూపించారు, అలానే ఒక సందర్భంలో నిర్మాత చార్మి ఎమోషనల్ అయిన సీన్ ని కూడా చూపించడం జరిగింది. మొత్తంగా ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూ తాలూకు ప్రామో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుండగా ఫుల్ ఇంటర్వ్యూ వీడియోని ఆగష్టు 19న విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు