మలయాళం లోకి లవ్ స్టోరీ…ప్రేమ తీరం గా అక్టోబర్ 29 న విడుదల

మలయాళం లోకి లవ్ స్టోరీ…ప్రేమ తీరం గా అక్టోబర్ 29 న విడుదల

Published on Oct 19, 2021 2:35 PM IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఈ చిత్రం ను మలయాళం లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ప్రేమ తీరం పేరిట ఈ చిత్రాన్ని అక్టోబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సోనాలి నారంగ్ సమర్పణ లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పతాకం పై నారాయణ్ దాస్ కే నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు లు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఏ ఆర్ రెహమాన్ వద్ద శిష్యరికం చేసిన పవన్ సి హెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు