తెలుగు, తమిళ భాషల్లో ఓ పక్క వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వెళుతోన్న పీవీపీ సినిమా, మరోపక్క పూర్తిగా కొత్తదనమున్న చిన్న సినిమాలను కూడా నిర్మించే ఆలోచనతో ‘క్షణం’ అనే ప్రయోగాత్మక సినిమాను సిద్ధం చేసిన విషయం తెలిసిందే! కనిపించకుండా పోయిన ఓ మూడేళ్ళ పాపను వెతికే ప్రయాణం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అడవి శేష్, అదాశర్మ, అనసూయ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ రెస్పాన్స్ చూసి రెట్టించిన ఉత్సాహంతో ‘క్షణం’ టీమ్ సినిమాను రిలీజ్కు రెడీ చేస్తోంది. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఫిబ్రవరి 10న క్షణం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సూపర్ స్టార్ మహేష్, సమంతల చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్లో ఉన్న మహేష్, సమంత క్షణం ట్రైలర్ను ఓ ప్రత్యేక ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు. ఇక రవికాంత్ పేరేపు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది.