రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన మహేశ్ బాబు..!

రమేశ్ బాబు పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన మహేశ్ బాబు..!

Published on Jan 22, 2022 7:53 PM IST

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రమేష్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో జనవరి 8న కన్నుమూశారు. అయితే ఆ సమయంలో మహేశ్ బాబు కోవిడ్ బారిన పడడంతో అన్నను కడసారి చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన మహేశ్ సోషల్ మీడియా వేదికగా తన అన్నపై ఉన్న ప్రేమ, అనుబంధాన్ని తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే ఇన్ని రోజులు క్వారంటైన్‌లో ఉన్న మహేశ్ బాబు తాజాగా కోవిడ్ పరీక్ష చేయించుకోగా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో మహేశ్ నేడు అన్న రమేష్ బాబు 13వ రోజు కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు. వదిన మృదుల మరియు పిల్లలను పరామర్శించాడు. ఇక ఈ కార్యక్రమానికి కృష్ణ, సుధీర్ బాబుతో పాటుగా మిగతా ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు