సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతికి నియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించారు. సాహిత్య మేధావి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఈ కష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. రెస్ట్ ఇన్ పీస్ సార్ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
Deeply saddened by the loss of lyrical genius Sirivennela Seetharama Sastry garu. My thoughts and prayers are with the family during this difficult time. Rest in peace sir.. You will be terribly missed ????
— Mahesh Babu (@urstrulyMahesh) November 30, 2021