సూపర్ స్టార్ మహేష్ బాబు అటు కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న SSMB28 మూవీ సెట్స్ మీద ఉంది. ఈ మూవీని 2023, ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. అలానే మరోవైపు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా తన సంపాదనలో కొంతభాగాన్ని సేవా కార్యక్రమాలకు నియోగిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు మహేష్ బాబు.
ఇప్పటికే తాను నెలకొల్పిన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా అనేకమంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించిన సూపర్ స్టార్, తాజాగా తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గల స్కూల్ లో డిజిటల్ లెర్నింగ్ క్లాస్ లు ప్రారంభించారు. కాగా ఇందుకు సహకరించిన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ మరియు యాజమాన్యానికి మహేష్ ఫౌండేషన్ వారు ప్రత్యేకంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తంగా ఈ విధంగా మరొక్కసారి మహేష్ బాబు తన ఉదారతని చాటుకున్నారు
A big day for us at MB Foundation. We have successfully introduced digital learning in Burripalem school! Thanking the principal and staff at Burripalem school for ensuring optimal use of the digital classroom. @urstrulyMahesh pic.twitter.com/e1Oh0ZVn9U
— Mahesh Babu Foundation (@MBfoundationorg) October 26, 2022