‘మహేష్ – రాజమౌళి’ అడ్వెంచర్ థ్రిల్లర్‌ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘మహేష్ – రాజమౌళి’ అడ్వెంచర్ థ్రిల్లర్‌ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Sep 27, 2021 8:06 PM IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి అండ్ ఆయన టీమ్ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రాశారట.

ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ 2022 చివరి భాగంలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు