లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మహేష్ ఫ్యామిలీ !

లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మహేష్ ఫ్యామిలీ !

Published on Oct 31, 2022 11:30 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు ట్రిప్ వేస్తుంటాడు. ఈ క్రమంలోనే మహేష్ తన బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం తీసుకుని, చిన్న వెకేషన్ కోసం లండన్ వెళ్లాడు. మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్ మరియు సితార, గౌతమ్ కూడా ఉన్నారు. ఐతే, ఈ రోజు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

వీరంతా ఈ ఉదయం హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఇక మహేష్ బాబు నవంబర్ మొదటి వారం నుంచి త్రివిక్రమ్‌తో తన తదుపరి రెండవ షెడ్యూల్‌ లో జాయిన్ అవ్వనున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మహేష్ బాబుతో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 28, 2023 న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు