‘సూపర్ స్టార్’తో సెల్ఫీ తీసుకున్న ‘సూపర్ స్టార్’ !

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన ఆ రోజు రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు తయారు చేసిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ లోని ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ ప్రాంగణంలో ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

కాగా ప్రస్తుతం ఈ విగ్రహం చూడటానికి మహేష్ అభిమానులు భారీ ఎత్తున అక్కడకి చేరుకుని విగ్రహాన్ని సందర్శించారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహేష్ తన మైనపు విగ్రహం పక్కన నుంచొని ఫోజులిస్తూ కనిపించారు. అన్నట్లు తన విగ్రహంతో తానే సెల్ఫీ తీసుకోవడం విశేషం.

ఇక ఈ రోజు సాయంత్రం వరకూ విగ్రహాన్ని ‘ఏ ఎమ్ బి’ సినిమాస్ లోనే ఉంచుతారు. ఆ తరువాత ఆ విగ్రహాన్ని సింగపూర్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలోకి తరలించి ఇక అక్కడే ప్రదర్శిస్తారు. మొత్తానికి టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబుకు మాత్రమే ఈ గౌరవం దక్కడంతో సూపర్ స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Exit mobile version