డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన మహేష్ “సర్కారు వారి పాట”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన మహేష్ “సర్కారు వారి పాట”

Published on Jun 15, 2022 1:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, సిజ్లింగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన సర్కార్ వారి పాట థియేటర్లలో అభిమానులను మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండనున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమా చూడటానికి 199 రూపాయలను చెల్లించవలసి ఉంటుంది.

ఈ రోజు, ప్రైమ్ వీడియో తాజాగా ప్రకటన చేయడం జరిగింది. జూన్ 23, 2022 నుండి చలనచిత్రం స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి థమన్ ఆకట్టుకునే బాణీలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు