నైజాంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ “పోకిరి”

నైజాంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ “పోకిరి”

Published on Aug 11, 2022 3:02 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మళ్లీ బాక్సాఫీస్ వద్ద భారీ విధ్వంసం సృష్టించేందుకు ఆయన అభిమానులు పోకిరి స్పెషల్ షోలు ఏర్పాటు చేశారు. ఊహించిన విధంగానే, ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆడియెన్స్ ప్రత్యేక షోలకు హాజరయ్యారు. ఫలితంగా పోకిరి రీ రిలీజ్ అన్ని చోట్లా ఘనవిజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

నైజాంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 69.07 లక్షలు గ్రాస్ వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. టాలీవుడ్‌లో రీ రిలీజ్ అయిన ఏ సినిమాలోనూ ఇది ఊహించలేని రికార్డ్. ఇదిలా ఉంటే స్పెషల్ షోలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఇలియానా నటించింది. ఈ కల్ట్ మూవీకి మణిశర్మ సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు