మేకింగ్ వీడియో తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన “మేజర్”

మేకింగ్ వీడియో తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన “మేజర్”

Published on Nov 3, 2021 10:20 AM IST

అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ చిత్రం షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసింది. దీపావళికి ఒక రోజు ముందు వారు మేజర్ అప్‌డేట్‌తో కూడా వచ్చారు. సినిమా మేకింగ్‌కి సంబంధించిన గ్లింప్స్ ను విడుదల చేస్తూ అద్భుతమైన ప్రయాణాన్ని చూపించింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11, 2022న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

120 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని 8 సెట్లు, 75 లొకేషన్లు, 3 భాషల్లో సినిమా చిత్రీకరించారు. అతని జీవితం, అతని ప్రేమ మరియు అతని వారసత్వం ఈ వీడియోలో చూపించబడ్డాయి. అడివి శేష్ యువ వయస్సు నుండి ధైర్య సైనికుడిగా మారడం ను చూపించడం జరిగింది. ఈ వీడియో సినిమా పై భారీ అంచనాలను నెలకొల్పింది అని చెప్పాలి.

అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా, 26/11 ముంబై దాడులలో అతని మరణాన్ని వర్ణించడమే కాకుండా, అతని ప్రయాణాన్ని గుర్తించడం మరియు అతను జీవించిన స్ఫూర్తిని స్వీకరించడం వంటి సైనిక అధికారి జీవితంలోని వీరోచితాలను మేజర్ లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా టీజర్‌ను రివీల్ చేస్తూ, మేజర్ బృందం సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని వివిధ దశలను, అతని బాల్యం, యుక్తవయస్సు నుండి సైన్యంలోని అద్భుతమైన సంవత్సరాల వరకు చూపించడం జరిగింది. వార్ డ్రామా పై భారీ అంచనాలు, ఉత్కంఠను ఈ టీజర్ క్రియేట్ చేసింది.

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, శోభితా ధూళిపాళ మరియు సాయి మంజ్రేకర్ నటించిన బహుభాషా చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి నిర్మిస్తోంది.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు