లేటెస్ట్ : విజయ్ ‘వరిసు’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

లేటెస్ట్ : విజయ్ ‘వరిసు’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Published on Nov 30, 2022 2:11 AM IST


ఇలయతలపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానున్న ఈ మూవీ అటు హిందీలో సైతం విడుదలకు రెడీ అవుతోంది. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న వరిసు మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన రంజితమే సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచిన సంగతి తెలిసిందే.

అయితే ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలో తెలిపిన మేకర్స్ మరొక్కసారి దానిని కన్ఫర్మ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఒక తాజా పోస్టర్ తో రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. కాగా అత్యథిక వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న వరిసు మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు