లేటెస్ట్ : ‘వరిసు’ సెకండ్ సాంగ్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

లేటెస్ట్ : ‘వరిసు’ సెకండ్ సాంగ్ పై సూపర్ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్

Published on Dec 3, 2022 7:15 PM IST


ఇళయ దళపతి విజయ్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ వరిసు. తెలుగులో వారసుడు గా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ పై తెలుగు, తమిళ భాషల ఫ్యాన్స్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ మంచి యాక్షన్ తో కూడిన రోమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ రంజితమే సూపర్ గా రెస్పాన్స్ అందుకోగా ఈ మూవీ నుండి #TheeThalapathy అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 4న సాయంత్రం 4 గం. లకు రిలీజ్ చేస్తున్నట్లు నిన్న యూనిట్ ప్రకటించింది. అయితే విషయం ఏమిటంటే ఈ సాంగ్ ని ప్రముఖ యంగ్ హీరో శింబు పాడుతున్నారని, ఆయన సూపర్ వాయిస్ తో సాంగ్ కి మరింతగా అందం వచ్చింది అంటూ మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ శింబు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దానితో వరిసు సెకండ్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా వరిసు మూవీని 2023 సంక్రాంతికి ప్రేక్షకాభిమానుల ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు