మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తూ దుమ్ము లేపుతుంది.
అయితే రీజనల్ గా ఈ సినిమా రికార్డులు అన్నీ తిరగరాస్తుంది అనిక్ చెప్పాలి. ఆల్రెడీ బుక్ మై షో బుకింగ్స్ లో ఫాస్టెస్ట్ 2 మిలియన్ బుకింగ్స్ క్రాస్ చేసిన సినిమాగా రికార్డు సెట్ చేయగా ఇప్పుడు 2.5 మిలియన్ ఫీట్ ని కూడా క్రాస్ చేసి ఫాస్టెస్ట్ ఎవర్ సినిమాగా నిలిచింది. ఇలా మెగాస్టార్ మాత్రం తన పేరిట బిగ్గెస్ట్ రికార్డులు సెట్ చేస్తున్నారు.
ఇక ఈ వీకెండ్ కి ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి. మరి ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ సాలిడ్ క్యామియోలో నటించి సినిమాకి మరింత బలం చేకూర్చారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటెర్టైన్మెంట్స్ మరియు షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహించారు.
#ManaShankaraVaraPrasadGaru is rewriting records in style 😎🔥
2.5MILLION+ TICKETS SOLD ON BMS #MegaSankranthiBlockbusterMSG ❤️🔥
ALL TIME FASTEST FOR A REGIONAL FILM 💥💥💥
Book your tickets now and have a Super Entertaining Weekend with your family at cinemas 😀🫶 pic.twitter.com/oeun3nrW4F
— Gold Box Entertainments (@GoldBoxEnt) January 17, 2026
