అంచనాలను పెంచుతున్న నవాబ్ తాజా ట్రైలర్ !

ప్రముఖ దర్శకుడు మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి , విజయ్ సేతుపతి , శింబు , అరుణ్ విజయ్ లు హీరోలుగా నటిస్తుండగా అదితి రావ్ హైదరి, ఐశ్వర్య రాజేష్ , డయానాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా తాజాగా విడుదలైన ఈ చిత్ర రెండవ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచుతుంది. మొదటి ట్రైలర్ తో పోల్చుకుంటే రెండో ట్రైలర్ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తండ్రి అధికారం కోసం ముగ్గురు సోదరుల మధ్య జరిగే రక్తపాత ఘర్షణతో ప్రధానంగా సాగుతుంది. అన్నదమ్ముల మధ్య సంఘర్షణ తో సినిమా బాగా ఆకట్టుకుందని చెబుతుంది చిత్రబృందం. దీనికి తోడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ఒకే సారి విడుదలకానుంది .

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Exit mobile version