టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “మార్క్ ఆంటోనీ”

కోలీవుడ్ యాక్టర్ విశాల్ మరియు ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మార్క్ ఆంటోనీ. ఇందులో వీరిద్దరూ డ్యూయల్ రోల్ లో నటించారు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. మే 12, 2024 న సాయంత్రం 6:00 గంటలకు ప్రసారం కానుంది. ఈ చిత్రంలో రీతూ వర్మ, సునీల్, సెల్వరాఘవన్, అభినయ, రెడిన్ కింగ్స్లీ, వై.జి.మహేంద్రన్ లు కీలక పాత్రల్లో నటించారు. ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version