వైరల్ పిక్ : మెగా ఫ్యామిలీ అడ్వాన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

వైరల్ పిక్ : మెగా ఫ్యామిలీ అడ్వాన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

Published on Dec 21, 2022 2:07 AM IST


టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా యువ హీరోలకి పోటీగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు సినిమాల పరంగా కూడా కొనసాగుతున్నారు.

అలానే మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగేంద్రబాబు తనయుడు వరుణ్ తేజ్, అల్లు అరవింద్ కుమారులు అల్లు అర్జున్, శిరీష్, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలు అందరూ కూడా వరుస సినిమాలతో అటు మెగా ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకెళ్తున్నారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, మరొక మూడు రోజుల్లో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంగా మెగా ఫ్యామిలీ యువతరం మొత్తం కలిసి అడ్వాన్స్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఇక వారందరూ కలిసి క్రిస్మస్ సంబరాల సందర్భంగా దిగిన పిక్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రమ్ లో పోస్ట్ చేసారు. కాగా ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు