MEGA 154, వీర సింహా రెడ్డి మూవీస్ ఓవర్సీస్ రైట్స్ వారికే … ?

MEGA 154, వీర సింహా రెడ్డి మూవీస్ ఓవర్సీస్ రైట్స్ వారికే … ?

Published on Oct 22, 2022 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకుడు బాబీ ప్రస్తుతం MEGA 154 మూవీ ఎంతో భారీ స్థాయిలో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ అఫీషియల్ టైటిల్ త్వరలో అనౌన్స్ కానుండగా ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో సూపర్ గా అంచనాలు ఉన్నాయి. శృతి హాసన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో ప్రస్తుతం రూపొందుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీకి వీర సింహా రెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీలో బాలయ్య ఒక మాస్ పవర్ఫుల్ రోల్ లో నటిస్తుండగా ఆయనకు జోడీగా అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ ని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా ఈ రెండు భారీ సినిమాల యొక్క ఓవర్సీస్ హక్కులను భారీ ధరకు ఫార్స్ ఫిలిమ్స్ కంపెనీ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అటు అఖండ తో బాలకృష్ణ, ఇటు గాడ్ ఫాదర్ తో చిరంజీవి ఇద్దరూ కెరీర్ పరంగా మంచి జోరు మీద ఉండడంతో ఈ రెండు సినిమాలు మంచి విజయం అందుకోవడం ఖాయం అని ఆయా మూవీ యూనిట్స్ అభిప్రాయపడుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు