షాకింగ్ : టాలీవుడ్ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం.!

షాకింగ్ : టాలీవుడ్ విషయంలో చిరంజీవి సంచలన నిర్ణయం.!

Published on Jan 2, 2022 2:40 PM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎందరో సినీ పెద్దల అనంతరం తాను తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దగా అనేక సందర్భాల్లో ముందు ఉండి పెద్దగా అనేక సమస్యలను పరిష్కారం చేశారు. అలాగే అనేక మందికి తన వంతుగా సాయాన్ని కూడా అందించారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరు పలు ఊహించని కామెంట్స్ చెయ్యడం సంచలనంగా మారింది.

“సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. పెద్దరికం పదవి నాకొద్దు.. ఆ స్థానమే నాకొద్దు.. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని.. అలాంటివారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయనమని చెప్పారు..

యోధా డయాగ్నిస్టిక్స్‌ వారితో నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ” 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం చాలా ఆనందంగా ఉంది. కేవలం మెంబర్స్‌కు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. ఇక మేమిచ్చే హెల్త్‌ కార్డ్‌, దీని క్యూఆర్‌ కోడ్‌లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. ఇప్పటివరకూ 7,699 కార్డులు సిద్దమయ్యాయి. మిగతావి కూడా ఈ నెలాఖరుకు పూర్తవుతాయి.

ప్రస్తుతం ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. షూటింగ్‌లో ఉన్నవాళ్లు అన్ని జాగ్రత్తలు తీసువాలి. ఇకపై ప్రతి దాంట్లో పెద్దరికంగా ఉండను. ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రాను’’ అని చిరు చెప్పుకొచ్చారు. ఆపదలో ఉంటే మాత్రం తప్పకుండా అండగా ఉంటానని.. అంతేకాదు వారిని ఆదుకుంటానని మెగాస్టార్ స్పష్టం చేశారు. దీనితో చిరు చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు