ప్రముఖ టాలీవుడ్ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా భావోద్వేగ నోట్ ను పోస్ట్ చేయడం జరిగింది.
గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్ ను కోల్పోవడం దురదృష్టకరం. ఆయన చాలా సౌమ్యుడు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మిత భాషి, ఆయన ఎడిటింగ్ మెళుకువలు అపరిమితం, ఎంత నెమ్మదస్తుడో, ఆయన ఎడిటింగ్ అంత వేగం. చట్టానికి కళ్లులేవు చిత్రం నుండి ఖైది నంబర్ 150 వరకు నా ఎన్నో చిత్రాలకి ఎడిటర్ గా పని చేసిన గౌతమ్ రాజు గారు లేకపోవడం వ్యక్తిగతం గానూ, మొత్తం పరిశ్రమ కి పెద్ద లోటు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి గారు సంతాపం తెలిపారు.
Rest In Peace Gowtham Raju garu! pic.twitter.com/kmkii0wM8K
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 6, 2022