ఆయన మరణం సినీ పాత్రికేయరంగం కి తీరని లోటు – మెగాస్టార్ చిరంజీవి!

ఆయన మరణం సినీ పాత్రికేయరంగం కి తీరని లోటు – మెగాస్టార్ చిరంజీవి!

Published on Jul 5, 2022 5:02 PM IST

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, పలు విషయాలను వెల్లడించారు.

గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సైన నిబద్దత కలిగిన సినీ విమర్శకుడు అంటూ చెప్పుకొచ్చారు. తన ఎన్నో చిత్రాల పై శ్రీహరి రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు, నటుడు గా తనను తాను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకొడానికి ఎంతో ఉపకరించాయి అని తెలిపారు. ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరని లోటు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు