మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు!

మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు!

Published on Nov 20, 2022 9:31 PM IST

వాల్తేర్ వీరయ్య నుండి వచ్చిన మొదటి సింగిల్ అనౌన్స్‌మెంట్‌తో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రం తర్వాత స్టార్ హీరో నెక్స్ట్ మూవీ ఇదే. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో, మెగాస్టార్ చిరంజీవి కి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు లభించింది.

గోవాలో నిర్వహించిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డు 2013లో స్థాపించబడింది. భారతీయ సినిమా అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది. చిరంజీవి కంటే ముందు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, హేమమాలిని, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. 150కి పైగా చిత్రాల ద్వారా సినీ పరిశ్రమకు ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను చిరంజీవిని ఇప్పుడు ఈ అవార్డుతో సత్కరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు