నరేంద్ర మోడీ పోస్ట్ పై మెగాస్టార్ చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నరేంద్ర మోడీ పోస్ట్ పై మెగాస్టార్ చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Nov 21, 2022 3:07 PM IST

53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022తో సత్కరించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నందుకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు స్టార్ హీరోను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు తెలిపారు. “చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు” అని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలకు గానూ, మెగాస్టార్ చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. ఈ మేరకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ. మీ మంచి మాటలకు చాలా కృతజ్ఞతలు” అని అన్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య అనే మాస్ ఎంటర్టైనర్‌తో చిరంజీవి తన అభిమానులను అలరించేందుకు వస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు