పవన్ తో మూవీ చేయడం పై మెగాస్టార్ ఏమన్నారంటే ?

పవన్ తో మూవీ చేయడం పై మెగాస్టార్ ఏమన్నారంటే ?

Published on Dec 27, 2022 10:45 PM IST


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని బాబీ తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన మూడు సాంగ్స్ అందరినీ అలరించి మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. సంక్రాంతి కానుకగా 2023, జనవరి 13న వాల్తేరు వీరయ్య రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ప్రత్యేక సెట్ లో వాల్తేరు వీరయ్య యూనిట్ మీడియా మీట్ జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తన అభిమానిగా దర్శకుడు బాబీ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ముఖ్యంగా అభిమానుల తో పాటు ఆడియన్స్ అందరూ నా నుండి కోరుకునే అన్ని అంశాలు దర్శకుడు బాబీ ఇందులో పొందుపరిచి తీసారని, యూనిట్ లో ప్రతి ఒక్కరు వాల్తేరు వీరయ్య కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. అనంతరం మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మెగాస్టార్, తన బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయడం పై స్పందించారు. నిజానికి పవన్ కళ్యాణ్ తో తనకు కూడా వర్క్ చేయాలని ఎప్పటి నుండో ఆలోచన ఉందని అన్నారు.

ప్రస్తుతం పవన్ కూడా వరుసగా ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండడం వలన అది మరొక రెండేళ్ల అనంతరం జరిగే అవకాశం ఉందని, అయితే పక్కాగా తామిద్దరికి తగ్గ విధంగా మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసి ఎవరైనా దర్శకుడు తీసుకువస్తే యాక్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అభిమానులు కూడా ఎప్పటినుండో తామిద్దరి కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ లో ఒక సాంగ్ లో అలానే శంకర్ దాదా జిందాబాద్ లో క్లైమాక్స్ లో వచ్చే సీన్ లో పవన్ కళ్యాణ్ కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు