మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక గా మరొక సమస్య పై తాజాగా పోస్ట్ చేశారు. నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన సంఘటన పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆటవిక సంస్కృతి, ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతం గా విధించడం మాత్రమే కాకుండా, అన్ని విద్యా సంస్థల్లో ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
భావితరాలకు భరోసా కల్పించడం మన అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘోరాలు మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కాకుండా చూడండి అంటూ తెలిపారు చిరు. మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022