మేఘ ఆకాష్ కొత్త సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన తల్లి బిందు ఆకాష్..!

మేఘ ఆకాష్ కొత్త సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన తల్లి బిందు ఆకాష్..!

Published on Feb 15, 2022 12:00 AM IST

‘డియర్ మేఘ’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత మేఘ ఆకాష్ మరో మంచి లవ్ స్టోరీ సైన్ చేసింది. ఈ చిత్రానికి డియర్ మేఘ దర్శకుడు సుశాంత్ రెడ్డి కథ అందించడమే కాకుండా నిర్మాణంలో కూడా పాలు పంచుకుంటున్నారు. సుశాంత్ రెడ్డి.ఏ & అభిషేక్ కోట నిర్మాణంలో, మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది.

మేఘ ఆకాష్ హీరోయిన్‌గా రూపొందబోతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి అసోసియేట్ అభిమన్యు బడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ డియర్ మేఘ లాంటి హిట్ చిత్రం తరువాత మేఘ ఆకాష్ తో మా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై చాలా అంచనాలున్నాయి. దర్శకుడు అభిమన్యు బడ్డి పై మాకు చాలా నమ్మకముంది. ముఖ్య నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నాం. షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలవుతుందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు