గుండెలు పిండేస్తున్న శ్రీహరి కొడుకు విన్నపం

గుండెలు పిండేస్తున్న శ్రీహరి కొడుకు విన్నపం

Published on Jul 12, 2019 9:30 AM IST

దివంగత హీరో శ్రీహరి కుమారుడు మేఘాంష్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం “రాజ్ దూత్” నేడు విడుదలకు సిద్ధమైంది. లవ్,కామెడీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్-కార్తీక్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా మేఘాంష్ లుక్ బాగుండడంతో పాటు,టీజర్,ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచాయి.

కాగా ఈ యంగ్ హీరో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ సందేశం విడుదల చేశాడు. శ్రీహరి కొడుకుగా పరిచయమవుతున్న నాపై ఎంతో బాధ్యత ఉంది. ఆయనలా మిమ్ముల్ని అలరించడానికి మీముందుకు వస్తున్నాను. ఆయనలా ఇప్పుడే బరువైన పెద్ద పాత్రలు చేయకపోయినా,భవిష్యత్తులో చేస్తాను. ఈ సినిమా చూశాక,శ్రీహరి కొడుకు బాగా చేసాడు, అని ప్రతి ఒక్కరు ఫిలయ్యేలా చేయాలని ఎంతో కష్టపడి చేశాను. ఈ మూవీ మీచేతుల్లో పెడుతున్నా, విజయం అందిస్తారని భావిస్తూ, అని కొంచెం ఎమోషనల్ విన్నపం చేశాడు. మరి ఇంతలా తన మూవీని ఆదరించండి అని వేడుకుంటున్న మేఘాంష్ అభ్యర్ధనను ప్రేక్షకులు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు