మొదటి షెడ్యూల్ ముగించిన పూరి!

మొదటి షెడ్యూల్ ముగించిన పూరి!

Published on Nov 15, 2017 4:26 PM IST

దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘మెహబూబా’ అనే సినిమాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తైంది. నెల క్రితం పారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, హర్యాన, పంజాబ్ వంటి ప్రాంతాల్లో సుమారు నెల రోజులపాటు నిర్విరామంగా జరిగింది. ఈ షెడ్యూల్లో ఆకాష్ పూరి, హీరోయిన్ నేహా శెట్టిల మధ్య కీలక సన్నివేశాలిని చిత్రీకరించారు.

1971 ఇండో-పాక్ యుద్ధం నైపథ్యంలో సాగే ఈ చిత్రం ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఉండనుంది. పూరి గత చిత్రాలకి పూర్తి భిన్నమైనదిగా ఉంటుందని చెప్పబడుతున్న ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మిస్తుండగా సందీప్ చౌత సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో కుమారుడ్ని హీరోగా నిలబెట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు పూరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు