న్యూ స్ట్రాటజీ తో ముందుకు వచ్చిన ‘మేమ్ ఫేమస్’ టీమ్

న్యూ స్ట్రాటజీ తో ముందుకు వచ్చిన ‘మేమ్ ఫేమస్’ టీమ్

Published on May 30, 2023 9:09 PM IST

సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ మేమ్ ఫేమస్. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సిరి రాసి, కిరణ్ మచ్చ, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ మరియు పలువురు ఇతర నటులు ఇందులో ముఖ్య పాత్రలు చేయగా ఈ మూవీని లహరి ఫిలిమ్స్, ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం బాగానే కలెక్షన్ రాబడుతోంది.

విషయం ఏమిటంటే, రిలీజ్ కి ముందు సినిమా ప్రమోషన్స్ లో సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వచ్చిన మేమ్ ఫేమస్ టీమ్ తాజగా మరొక న్యూ స్ట్రాటజీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులందరికీ మేకర్స్ కొత్త ఆఫర్‌ను అందిస్తున్నారు. ఏపీ మరియు తెలంగాణలో ఎంపిక చేసిన థియేటర్లలో విద్యార్థుల కోసం తమ మూవీ టికెట్ ధరలను రూ. 99 గా నిర్ణయించారు. కాగా ఈ ఆఫర్ అన్ని రోజులలో అన్ని షోలకు అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఒకరకంగా ఇది మంచి స్ట్రాటజీ అని,అయితే దీనికి స్టూడెంట్స్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలని అభిప్రాయపడుతున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు