ఈ నెల 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతున్న “మిస్సింగ్” సినిమా..!

ఈ నెల 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతున్న “మిస్సింగ్” సినిమా..!

Published on Nov 13, 2021 3:00 PM IST


హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో హర్షా నర్రా మాట్లాడుతూ “మిస్సింగ్” సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలాసార్లు వచ్చిన మీడియాకు థాంక్స్. మా సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసమే తెరకెక్కించాం. అందుకే ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా థియేటర్ రిలీజ్‌కే మొగ్గు చూపాం. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది. తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లలో ఈ నెల 19న విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్, మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్ అనిపించిందని, మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుందని అన్నారు.

హీరోయిన్ నికీషా రంగ్వాలా మాట్లాడుతూ మిస్సింగ్ మూవీలో మిస్ అయ్యేది నేనే. కాబట్టి ఈ నెల 19న ప్రేక్షకులు అందరూ నన్నే వెతుకుతారు అనుకుంటున్నాను. ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మిస్సింగ్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు నా క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని అన్నారు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ అంతా కొత్త వాళ్లం కలిసి చేసిన చిత్రమిది. కొత్త వాళ్లను ఆదరించడంలో మన ప్రేక్షకులు ముందుంటారు. మిస్సింగ్ చిత్రంతో మేము చేసిన ప్రయత్నాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా మూవీలో ఎక్కడా వల్గారిటీ ఉండదు. మంచి థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే చిత్రమిది. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. మా సినిమాలో లోపాలు ఉంటే చెప్పండి కరెక్ట్ చేసుకుంటాం. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఉండాలన్నదే మా కోరిక. ఈ నెల 19న థియేటర్ లలో మిస్సింగ్ చూసి ఆదరించండని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు