‘మిస్టర్’ కు కత్తిరింపులు తప్పలేదు !

‘మిస్టర్’ కు కత్తిరింపులు తప్పలేదు !

Published on Apr 18, 2017 8:30 AM IST


మెగా హీరో వరుణ్ తేజ్, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘మిస్టర్’ చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రేక్షకులకు అంతగా నచ్చని అంశాల్లో సినిమా రన్ టైమ్ కూడా ఒకటిగా ఉంది. రెండు భాగాల్లోనూ లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్ కాస్త ఇబ్బంది ఫీలయ్యారు. ఈ విషయాన్నే గమనించిన చిత్ర యూనిట్ రన్ టైమ్ కాస్త తగ్గిస్తే బాగుంటుందని భావించిందట.

అందుకే సినిమాలోని కొన్ని సీన్లను సుమారు 17 నిముషాల నిడివి వరకు కట్ చేసినట్టు సమాచారం. ఈ కత్తిరింపులతో ఆడియన్స్ కాస్త వెసులుబాటు ఫీలయ్యే అవకాశముందని, ఈ కటింగ్స్ లో కొన్ని అనవసరమైన బోరింగ్ సీన్స్ కూడా తొలగించబడ్డాయని, దీంతో చిత్రాన్ని చోడటం మునుపటి కంటే ఇప్పుడు ఇంకాస్త సౌకర్యవంతంగా ఉందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు