ఆదరగోట్టనున్న పంజా విలన్

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం డిసెంబర్ 9 న విడుదల కాబోతోంది. ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సరికొత్త విషయం ఏమిటంటే, ఈ చిత్ర విలన్ గురించి మాకు అందిన సమాచారం మేరకు, అడివి శేష్ విలన్ పాత్ర కు ప్రాణం పోసాడు. ఒక క్రూరమైన విలన్ గా అతడి నటన చాలా బాగుందని చెబుతున్నారు.

ఒక కథ పండాలంటే హీరో ఎంత ముఖ్యమో, విలన్ కూడా అంతే ముఖ్యం అని మనకి తెలుసు. పంజా విషయం లో ఇది రుజువు కాబోతోందని అంటున్నారు. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. అంజలి లవనియా , సారా జేన్ డియాస్ నటించిన ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి నిర్మాతలు

Exit mobile version