పార్న్ ని లీగల్ చేయాలి అంటున్న రామ్ గోపాల్ వర్మ

పార్న్ ని లీగల్ చేయాలి అంటున్న రామ్ గోపాల్ వర్మ

Published on Feb 12, 2012 7:12 PM IST

రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడిన సంచలనమే. పెళ్లి గురించి మాట్లాడిన, వాయిలెన్స్ గురించి మాట్లాడినా, ఆయన తేయబోయే సినిమా గురించి మాట్లాడిన ఏది మాట్లాడిన ఒక సంచలమై కూర్చుంటుంది. ముంబై ఆధారంగా నడిచే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం పార్న్ ని లీగల్ చేయాలి అన్నారు. ఆ పత్రిక రిపోర్టర్ ఈ విషయం గురించి విశ్లేషణ ఇవ్వమని కోరగా ఎన్ని రోజులు ఇలా ముసుగు వేసుకుంటాం, పార్న్ ని లీగల్ చేస్తే మన పిల్లల్ని, ఆడవాళ్ళని కాపాడుకోవచ్చు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన విషయం తెలిసిందే. పార్న్ చూడడం నేరం కాదు. దానిని లీగల్ చేస్తే ఇంకా ఏ గొడవ ఉండదు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు