డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “మెన్ టూ”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “మెన్ టూ”

Published on Jun 5, 2023 12:01 PM IST

కొన్ని వారాల క్రితం తెలుగులో వచ్చిన మెన్ టూ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, కౌశిక్ ఘంటసాల, మౌర్య సిద్దవరం ప్రధాన పాత్రలు పోషించారు. తాజా అప్డేట్ ఏమిటంటే, సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. డిజిటల్ ప్రీమియర్ తేదీని ఓటిటి ప్లాట్ ఫారం లాక్ చేసింది.

జూన్ 9, 2023న ఆహా ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ చేయబడుతుంది. ఆహా అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించగా, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మౌర్య సిద్దవరం, తన ప్రొడక్షన్ బ్యానర్ లాంతర్ క్రియేటివ్ వర్క్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి సంగీతం ఎలిషా ప్రవీణ్ మరియు నేపథ్య సంగీతం ఓషో వెంకట్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు