వైవిధ్యమయిన పాత్రలో కనిపించబోతున్న ప్రియమణి

ప్రియమణి ప్రధాన పాత్రలో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ శంఖుచక్ర ఫిలిమ్స్ పతాకం పై టి.కోటి నిర్మించనున్న ఈ సినిమా ద్వారా ప్రేమ్ ఆర్యన్ దర్శకునిగా పరిచయం కానున్నారు. “ఓ ప్రముఖ కథానాయకుడు ఈ చిత్రంలో నటించబోతున్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ సినిమాగా తీయబోతున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం లో ప్రియమణి పాత్ర వైవిద్యంగా ఉండబోతుంది అని నిర్మాత తెలిపారు.ఈ చిత్రాన్ని ఎ.జగన్‌మోహన్‌రెడ్డి సమర్పిస్తున్నారు.

Exit mobile version