‘మజ్ను’ అప్పుడే ఫైవ్ మిలియన్లు సాధించాడు !

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత చేస్తోన్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’. కాగా ట్రైలర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ ట్రైలర్ అప్పుడే ఫైవ్ మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇక మజ్ను ప్రీ రిలీజ్ వేడుకకు జూ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా రావడం కూడా ఈ సినిమాకి బాగానే కలిసొచ్చింది.

ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version