“ఆదిపురుష్” టీం పై మరింత ఒత్తిడి.?

“ఆదిపురుష్” టీం పై మరింత ఒత్తిడి.?

Published on Nov 25, 2022 7:04 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా షూటింగ్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు అయితే సినిమా విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఇప్పుడు మరింత సమయం మరియు బడ్జెట్ కేటాయించి మళ్ళీ రెడీ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వచ్చిన మన టాలీవుడ్ సినిమా హనుమాన్ టీజర్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి మారింది.

దీనితో అయితే ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలోనే అంత గ్రాండ్ విజువల్స్ ఉంటే ఆదిపురుష్ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాకి ఎలా ఉండాలి అంటే ఒక్క మన ఆడియెన్స్ లోనే కాకుండా నార్త్ ఆడియెన్స్ లో కూడా నెమ్మదిగా టాక్ స్టార్ట్ అవుతూ వస్తుంది. దీనితో అయితే ఇప్పుడు ఆదిపురుష్ టీం పై మరింత ఒత్తిడి పడినట్టు అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈసారి అయినా ఎలాంటి అవుట్ పుట్ ని అందిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు