అక్కినేని అఖిల్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రం ను దసరా కానుక గా అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేయగా, తాజాగా అక్టోబర్ 15 వ తేదీ న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన యూ ఎస్ ప్రీమియర్స్ పై చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం యూ ఎస్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 14 వ తేదీ న వేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సరిగమ సినిమాస్ వారు ఈ సినిమాను యూ ఎస్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించడం జరిగింది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.