డిజైనర్ దుస్తుల రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి ఆధ్వర్యంలో ఆమె మాతృ ప్రాంతమైన విజయవాడలో “ముగ్ధ” ఆర్ట్ డిజైనర్ స్టూడియో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత మరియు ప్రముఖ సినీ నటులు శ్రియ, ఫరియా అబ్దులా ఈ స్టోర్ను ప్రారంభించారు.
అయితే ముగ్ధ డిజైనర్ దుస్తులకు ఏపీలో చాలా మంది అభిమానులు ఉన్నారు. వారికి ముగ్ధను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో విజయవాడలోని ఎంజీ రోడ్డులో అతిపెద్ద లగ్జరీ రిటైల్ స్టోర్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. చెట్టినాడ్ డిజైన్లతో పాటు ఒక అందమైన దేవాలయంలోకి అడుగుపెట్టేలా ఈ స్టోర్ ను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ ఏర్పాటు చేస్తున్నామని, స్టోర్ ముందు భాగంలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఒక కొత్త షాపింగ్ అనుభూతిని కలిగిస్తుందని అన్నారు.
మన వారసత్వం, దేశంలో గొప్ప చేనేతలకు ప్రత్యేక నిలయం ఇది. కాంజీవరం నుంచి బెనారస్ చీరాల వరకు, ఇకత్ నుంచి గద్వాల వరకు, పైథాని నుంచి ఉప్పదాస్ వరకు ఈ స్టోర్లో అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఈసారి రెడీమేడ్, బ్రైడల్ వేర్ లెహంగాస్ అందుబాటులోకి తెస్తున్నాం. ఆధునిక మహిళల దృష్టిలో పెట్టుకొని స్ఫూర్తిదాయక పెళ్లి దుస్తులు, సొగసైన రంగులతో కూడిన దుస్తులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మగవారికి సంబంధించిన కొన్ని అద్భుతమైన షేర్వాణీలు, కుర్తాలు ఇండో వెస్ట్రన్లో అందిస్తున్నామని, ఒక వన్ స్టాప్ వెడ్డింగ్ డెస్టినేషన్గా ముగ్ధను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు.
మంత్రి సుచరిత మాట్లాడుతూ నా కుమార్తె వివాహానికి శశి వంగపల్లి పెళ్లి దుస్తులను డిజైన్ చేశారని, అవి మాకు, మా కుటుంబ సభ్యులకు ఎంతగానో నచ్చాయని, శశి అంటే పేరు కాదు.. ఒక ఒక డిజైనర్ బ్రాండ్ అన్నారు.
సినీతారలు శ్రీయా సరన్, ఫరియా అద్బుల్లా మాట్లాడుతూ శశి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటుచేసిన డిజైన్ స్టూడియోలోకి అడుగుపెడితే ఒక ఆలయంలోకి అడుగుపెట్టనట్లుగా ఉంటుందని, మంచి వాతావరణంలో షాపింగ్ చేసే అనుబూతిని పెంచుతుంది. అలాగే ఇప్పడు విజయవాడ ప్రజల కోసం, వారిలో కొత్త షాపింగ్ అనుభూతిని నింపేందుకు ఇక్కడ కూడా అదే తరహాలో ఒక మంచి సంప్రదాయ డిజైన్తో స్టోర్ను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు.
డిజైనర్ శశి వంగపల్లి మాట్లాడుతూ విజయవాడ మా పుట్టిన ఊరు. ఇక్కడ చాలా కాలం నుంచి స్టోర్ ఏర్పాటుచేయాలని అనుకుంటున్నామని, ఇప్పటికి ఈ కల నెలరవేరిందని అన్నారు. ఇక్కడ ప్రజలకు, నా డిజైనర్ దుస్తులను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ భారీ స్టోర్ను ఏర్పాటుచేశామని అన్నారు.
ముగ్ధ ఆర్ట్ స్టూడియో గురించి
ముగ్ధా ఆర్ట్ స్టూడియో 2012 సంవత్సరంలో ఒకే గదిలో ప్రారంభమైంది. బ్రాండ్ వ్యవస్థాపకురాలు మరియు చీఫ్ డిజైనర్ శశి వంగపల్లి దీనిని భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు సంప్రదాయాలు చిత్రణగా భావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లతో, ముగ్ధా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. విస్తృత శ్రేణి సేకరణతో పాటు, ప్రతి సందర్భానికి తగిన దుస్తులు ఈ స్టోర్ కలిగి ఉంటుంది. హైదరాబాద్ కస్టమర్లకు అతిపెద్ద ఆనందం ఏమిటంటే, శ్రీమతి శశి వంగపల్లి, డిజైనర్ స్వయంగా అందుబాటులో ఉన్నారు మరియు వారి కస్టమ్ మేడ్ డిజైన్ల కోసం ఆమె వధువులతో వ్యక్తిగతంగా సంభాషిస్తారు. ఇక నుంచి విజయవాడ వాసులకు శశి వంగపల్లి అందుబాటులోకి రానున్నారు. ఆధునిక భారతీయ వధువులకు తగిన విధంగా డిజైన్లను రూపొందించడంతోపాటు మన నవయుగ భారతీయ వధువును దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. డిజైన్ ఆధునికమైనది అయినప్పటికీ ఆమె హృదయాన్ని లోతుగా పాతుకుపోయిన భారతీయ సంప్రదాయాలు నింపారు.