మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని క్లాసిక్ మాస్ హిట్ చిత్రాలలో ఒకటైన ‘ముఠా మేస్త్రి’ థియేటర్లలోకి మళ్లీ రానుంది. 4K టెక్నాలజీతో సరికొత్త డిజిటల్ వర్షన్‌గా సిద్ధమైన ‘ముఠా మేస్త్రి 4K’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.

ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. రాజ్‌-కోటి అందించిన చార్ట్‌బస్టర్ పాటలు, చిరు నోట మాస్ డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులను విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ బర్త్‌డే కానుకగా మళ్లీ వెండితెరపై మేస్త్రి మాస్ హంగామాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version