మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “మై డియర్ దొంగ”

కమెడియన్ అభినవ్ గోమఠం మరియు కేబుల్ రెడ్డి నటి షాలిని కొండేపూడి ప్రధాన జంటగా నటించిన లేటెస్ట్ వెబ్ ఫిల్మ్ మై డియర్ దొంగ డైరెక్ట్ డిజిటల్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫారం అయిన ఆహా వీడియో లో సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి హైప్ ను సొంతం చేసుకున్న ఈ కామెడీ ఎంటర్టైనర్, ప్రస్తుతం 50 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకు పోతుంది.

BS సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మరియు చంద్ర వెంపటి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల మరియు సాయి శశాంక్ మండూరి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version