రాజమౌళి గారితో వర్క్ చేయటం నా డ్రీమ్ – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

రాజమౌళి గారితో వర్క్ చేయటం నా డ్రీమ్ – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

Published on Nov 2, 2022 8:27 PM IST


తెలుగు సినిమా పరిశ్రమకి యువ దర్శకుడు అనుదీప్ కేవి తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఫరీయా అబ్దుల్లా. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో హీరోయిన్ గా తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ను అలరించి మంచి పేరు సంపాదించారు ఫరియ.

ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన ఫరియా లేటెస్ట్ గా చేస్తున్న సినిమా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తుండగా ఈ మూవీని యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు దర్శకుడు గాంధీ. మొదటి నుండి ఆడియన్స్ లో మంచి అంచనాలని ఏర్పరిచిన ఈ మూవీ, ఇటీవల టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింతగా పెంచేశాయి.

మరొక రెండు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే మూవీకి సంబంధించి పలు ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు హీరో శోభన్ హీరోయిన్ ఫరియా. ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి ఒక టివి షోలో భాగంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ తనకి టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారితో వర్క్ చేయటం అనేది డ్రీమ్ అని, ఆయన చేసిన అన్ని సినిమాలు చూశానని, ఆయన సినిమాల్లో ఒక అవకాశం వస్తే తన కల నెరవేరినట్లే అంటూ చెప్పుకొచ్చారు ఫరియా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు