నాగ చైతన్య సరసన పూజా హెగ్డే ?

అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి డైరెక్షన్ లో చేస్తున్న భారీ చిత్రం “తండేల్”. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే, చైతు విరూపాక్ష సినిమాతో పేరు తెచ్చుకున్న కార్తీక్ దండుతో మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

ఐతే, పూజా హెగ్డే ఈ చిత్రంలో నాగ చైతన్యతో కలిసి నటించబోతోంది. కాకపోతే, పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోంది అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) నిర్మించబోతుంది. ఈ ప్రాజెక్ట్‌ కి సంబంధించిన మరిన్ని అప్‌ డేట్‌ ల కోసం మా సైట్ ను చూస్తూనే ఉండండి.

Exit mobile version