వైరల్ : సూపర్ స్టార్ మహేష్ & కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీ చేయనున్నారా … ?

వైరల్ : సూపర్ స్టార్ మహేష్ & కింగ్ నాగార్జున మల్టీస్టారర్ మూవీ చేయనున్నారా … ?

Published on Aug 26, 2022 12:00 AM IST

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. గరుడవేగా దర్శకడు ప్రవీణ్ సత్తారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంస్థలు నిర్మించిన ఈ మూవీలో నాగ్ సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించారు. భరత్ సౌరభ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

ఇక నేడు ఈ మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ ఆవిష్కరించి యూనిట్ కి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలిపారు. థ్రిల్లింగ్, యాక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో అదరగొట్టిన ది ఘోస్ట్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి ఆదరణతో కొనసాగుతోంది. అయితే ట్రైలర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబుకి ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలిపిన కింగ్ నాగార్జున, గతంలో 29 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ తో వర్క్ చేసిన వారసుడు మూవీ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, మనం ఇద్దరం కూడా ఎందుకు కలిసి యాక్ట్ చేయకూడదు అంటూ పోస్ట్ చేసారు.

అయితే దానికి రిప్లై ఇచ్చిన మహేష్, మీతో వర్క్ చేయడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు. నిజానికి ఒకవేళ వీరిద్దరూ కలిసి చేసే మూవీ కనుక సెట్ అయితే ఆ మల్టీస్టారర్ నిజంగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. మరి అది ఎప్పుడు జరుగుతుందో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు