కొద్ది రోజుల క్రితం తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ఏపీ సీఎంను కలిసి టిక్కెట్ ధరలపై తమ సమస్యలను చర్చించుకున్నారు. బాలయ్యకు కూడా ఆహ్వానం అందిందని, అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారని సమాచారం.
ఈరోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జరిగిన ఓ ప్రైవేట్ ప్రెస్మీట్లో బాలయ్య మాట్లాడుతూ, చిరు నుంచి తనకు నిజంగానే ఆహ్వానం అందిందని, అయితే దానిని తిరస్కరించానని చెప్పారు. టికెట్ రేట్లు ఉన్న సమయం లోనే తాను అఖండ చిత్రాన్ని విడుదల చేశానని, దానికి తగ్గట్టు గానే బడ్జెట్ ప్లాన్ చేసి విడుదల చేశానని, అందుకే బ్లాక్బస్టర్ ని సాధించానని బాలయ్య తెలిపారు. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి.