యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియన్ మూవీ మైఖేల్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. రేపు హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది.
ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ హీరో, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నారనేది తాజా సమాచారం. మేకర్స్ ఇదే విషయాన్ని అధికారికంగా ఆన్లైన్లో ప్రకటించారు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్ మరియు ఇతరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.