“నీకు నాకు పెళ్ళంట’ ట్రైలర్ లాంచ్ చేసిన మా కొత్త ప్రెసిడెంట్ విష్ణు!

“నీకు నాకు పెళ్ళంట’ ట్రైలర్ లాంచ్ చేసిన మా కొత్త ప్రెసిడెంట్ విష్ణు!

Published on Oct 16, 2021 12:00 PM IST

నూతన నటీనటులు హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం “నీకు నాకు పెళ్ళంట”. శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ ను ఇప్పుడు ‘మా’ సరికొత్త ప్రెసిడెంట్ మరియు నటుడు మంచు విష్ణు విడుదల చేయడం జరిగింది.

మరి ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ…”కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను” అని అన్నారు.

ఇక ఈ చిత్రంలోశ్యామ్ కార్తిక్, సంజనా అన్నే సహా ఖయ్యుమ్, వాసు ఇంటూరి, శ్రీ సుధ, ప్రియ పాలువై, దివ్య తదితరులు నటిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు బ్యానర్: శతాబ్ది సినిమాస్, నిర్మాత: కాసు శ్రీనివాస్ రెడ్డి, కెమెరామెన్: ఆదిత్య మణికంఠ, ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి, ఆర్ట్: తాళ్లూరు కృష్ణమోహన్, సంగీతం: రఘు కంచె, ఎగ్జిక్యూటివ్: చైతన్య లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు